శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేశారు. గాంధీతో పాటు ఆయన కుమారుడు, సోదరుడిపై కూడా కేసు నమోదు చేశారు. మరో ఇద్దరు కార్పొరేటర్లు వెంకటేశ్ గౌడ్, శ్రీకాంత్ ను నిందితులుగా చేర్చారు. గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య గత రెండు రోజులుగా వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. వివాదం మధ్యలోకి ప్రాంతీయత రావడంతో పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చింది. గురువారం నాడు అరికెపూడి గాంధీ తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగగా జనాల్లో కొంతమంది కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు.

ఈ క్రమంలోనే పోలీసులు అరికెపూడి గాంధీతో పాటు ఆయన అనుచరులను అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తాజగా ఇంటిపై దాడి వ్యవహారంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు అరికపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సెటిలర్లను బీఆర్ఎస్ కు దూరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాలను రాజేసేందుకు బీఆర్ఎస్ యత్నిస్తోందని గాంధీ ఆరోపించారు పదేళ్ల కేసీఆర్ పాలనలో సెటిలర్లకు ఏనాడు ఇబ్బందులకు గురిచేయలేదని, సెటిలర్ల కాలిలో ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని కేసీఆర్ అన్నారని పాడి కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *