Breaking Latest News

News5am, Breaking Latest News (14-06-2025): తెలంగాణలో కొత్త మంత్రులకు సెక్రటేరియట్‌లో రూములు కేటాయించారు. కార్మిక, మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామికి రెండో అంతస్తులో 20, 21, 22 నెంబర్ల గదులు ఇచ్చారు. అలాగే అడ్లూరి లక్ష్మణ్‌కు మొదటి అంతస్తులో 13, 14, 15 నెంబర్ల గదులు, మంత్రి వాకిటి శ్రీహరికి రెండో అంతస్తులో 26, 27, 28 నెంబర్ల గదులు కేటాయించారు.

జూన్ 8న మంత్రులుగా ప్రమాణం చేసిన ఈ ముగ్గురికి, జూన్ 11న శాఖలు అప్పగించారు. ప్రతి మంత్రికి రెండు శాఖల చొప్పున బాధ్యతలు ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న కొన్ని శాఖలను ఈ మంత్రులకు ఇచ్చారు. వివేక్ వెంకటస్వామికి కార్మిక, మైనింగ్, ఉపాధి శాఖలు, శ్రీహరికి పశుసంవర్ధక, స్పోర్ట్స్, కల్చర్ శాఖలు, లక్ష్మణ్‌కి ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖలు అప్పగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి 19 నెలల తర్వాత కేబినెట్ విస్తరణ జరిగింది. ఇప్పుడు సీఎం సహా మొత్తం 15 మంది మంత్రులు ఉన్నారు, ఇంకా 3 మంత్రి స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

More Latest News:

Breaking Latest News:

మచిలీపట్నంలో వైసీపీ నేతలతో పేర్నినాని అత్యవసర సమావేశం..

కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు మాజీ సీఎం కేసీఆర్..

More Breaking Latest News: External Sources

సెక్రటేరియట్లో కొత్త మంత్రులకు ఛాంబర్లు.. ఏ ఫ్లోర్ లో ఎవరంటే.?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *