Breaking Telugu News

News5am,Breaking Telugu New (05-05-2025): భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై కచ్చితమైన దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల తొమ్మిది కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశాయి. వీటిలో ప్రధాన కార్యాలయాలు, శిక్షణా కేంద్రాలు కూడా ఉండటంతో ఈ చర్యకు విశేష ప్రాముఖ్యత లభించింది.

ఈ దాడుల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమై చర్యల వివరాలను వివరించారు. రెండు వారాల క్రితం జమ్మూకశ్మీర్‌లో జరిగిన దారుణ ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం, ఈ ప్రతిదాడికి దారితీసింది. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని భారత్ మరోసారి తేల్చి చెప్పింది.

More Breaking Telugu News

శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో చోరీ..

మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఆర్టీసీ సంఘాల నేతలు కలిశారు..

More Breaking Telugu New: External Sources

Operation Sindoor : పాక్ లోని స్థావరాలపై విరుచుకుపడిన భారత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *