Harish Rao

బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు రాజీనామాకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు. ఆగస్టు 15 నాటికి చాలా చోట్ల రుణమాఫీ జరగలేదని స్పష్టం చేశారు. రుణమాఫీ పాక్షికమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డే చెప్పారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి నిర్వహించింది చిట్ చాట్‌లు కాదని.. చీట్ చాట్‌లని విమర్శించారు. చిట్ చాట్ రికార్డు ఉండదు కాబట్టి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని అన్నారు. రుణ మాఫీ చేయని గజ దొంగ, నన్ను దొంగ అంటున్నారని విమర్శించారు.

వాల్మీకి స్కామ్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారని హరీశ్ రావు ఆరోపించారు. వాల్మీకి స్కామ్‌పై ఈడీ విచారణ కోరే దమ్ము కాంగ్రెస్‌కి ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ ఎందుకు విచారణ చేయట్లేదని ప్రశ్నించారు. బడే భాయ్ చోటా భాయ్ కాబట్టే తెలంగాణలో విచారణ చేయట్లేదని అన్నారు. ఒక పక్క రాహుల్ గాంధీ, మరో పక్క బీజేపీ కూడా వాల్మీకి స్కామ్‌పై మాట్లాడటం లేదని హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కూల్చివేతల ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. దీంతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పూర్తిగా తగ్గిపోయిందని అన్నారు. బుద్ద భవన్‌లో హైడ్రా ఆఫీసు, జీహెచ్ఎంసీ ఆఫీసు నాలా మీదనే ఉన్నాయని, ముందు వీటిని, నెక్లెస్ రోడ్డులో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లు, రెస్టారెంట్లు, ఐ మ్యాక్స్‌లను కూలగొట్టాలని డిమాండ్ చేశారు. నోటీసులతో పాటు పరిహారం కూడా ఇవ్వాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *