ఏపీలోని కూటమి ప్రభుత్వం కోసం కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. 15వ ఆర్థిక సంఘం నిధులగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.1121.20 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఊపిరి లభించింది.
ఈ విడుదలైన నిధుల్లో 70 శాతం గ్రామ పంచాయతీలకు, 20 శాతం మండల పరిషత్లకు, 10 శాతం జిల్లా పరిషత్లకు కేటాయించనున్నారు. జనాభా ప్రాతిపదికన ఆయా గ్రామ పంచాయతీల బ్యాంక్ ఖాతాలకు నేరుగా నిధులు జమ కానున్నాయి. ఆర్థిక శాఖ అనుమతితో పంచాయతీ రాజ్ శాఖ ఈ ప్రక్రియను చేపట్టనుంది. దీనివల్ల గ్రామీణాభివృద్ధి మరింత వేగం పొందనుంది.