భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయంత్రం 4.30 గంటలకు భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మోదీని రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃనిర్మాణ ప్రారంభోత్సవానికి ఆహ్వానించనున్నారు. మే 2వ తేదీన మోదీ అమరావతిలో పర్యటించనున్నారు. ఈ భేటీకి ఒక ప్రత్యేకత కూడా ఉంది, ఎందుకంటే చంద్రబాబు తన భార్య భువనేశ్వరితో కలిసి తొలిసారి ప్రధానితో సమావేశం అవుతున్నారు.

ఈ సమావేశంలో అమరావతి నిర్మాణం, పోలవం ప్రాజెక్టు మరియు ఇతర కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. రాజధానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన కార్యక్రమం కావడంతో, ముఖ్యమంత్రి సతీసమేతంగా ప్రధాని మోదీని కలసి ఆహ్వానించనున్నారు. అమరావతి పర్యటనపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుంది, ఈ సందర్భంగా ఏపీ మంత్రి నారాయణ ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *