Revanth Reddy

CM Revanth Reddy: గోదావరి తాగునీటి సరఫరా ఫేజ్–2, 3 ప్రాజెక్ట్ పనులను సీఎం రేవంత్ రెడ్డి నేడు గండిపేట వద్ద ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ఖర్చు సుమారు ₹7,360 కోట్లు. దీని ద్వారా గోదావరి నుంచి 20 టీఎంసీల నీటిని నగరానికి తీసుకురాబోతున్నారు. అందులో 17.5 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు, మరో 2.5 టీఎంసీలు మూసీ నది శుద్ధి మరియు జంట జలాశయాల పునరుద్ధరణకు వినియోగించనున్నారు.

ప్రస్తుతం నగరానికి వివిధ ప్రాజెక్టుల ద్వారా రోజుకు 580 నుంచి 600 ఎంజీడీల నీరు అందిస్తున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మల్లన్నసాగర్ నుంచి మరో 300 ఎంజీడీల నీటిని సరఫరా చేయాలని యోచిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ డీపీఆర్ వాప్కోస్ కంపెనీ సిద్ధం చేసింది. ఘన్‌పూర్, శామీర్‌పేట్ వద్ద 1,170 ఎంఎల్డీ సామర్థ్యంతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించనున్నారు. అలాగే ఘన్‌పూర్ నుంచి ముత్తంగి వరకు భారీ పైప్‌లైన్, పంప్ హౌజ్‌లు, సబ్‌స్టేషన్లు నిర్మించనున్నారు. అధికారులు చెప్పిన ప్రకారం, 2 ఏళ్లలో పనులు పూర్తి చేసి నగరానికి అదనంగా 300 ఎంజీడీల నీటిని అందించడమే లక్ష్యం.

Internal Links:

కవిత వ్యాఖ్యలపై తొలిసారి స్పందించిన హరీష్ రావు…

ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ గణపతి హోమం..

External Links:

నేడు గండిపేట వద్ద గోదావరి ఫేజ్ 2&3 కి శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *