CM Revanth Reddy Slams Kcr

CM Revanth Reddy Slams Kcr: మాజీ సీఎం కేసీఆర్‌పై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు, అవినీతి జరిగాయని సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. దొర నుంచి దోపిడి దొంగగా మారి ప్రజల సొమ్ము దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబానికి లక్ష కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి, తెలంగాణ ప్రజలకు లక్ష కోట్ల అప్పు ఎలా వచ్చింది అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌, ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టులు స్పష్టం చేశాయని తెలిపారు. ప్రాజెక్టును ప్రాణహిత-చేవెళ్ల నుంచి మేడిగడ్డకు మార్చి, పేరును కూడా మార్చి కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. వ్యాప్కో నివేదికను కేసీఆర్‌ ఇష్టానుసారం మార్చించుకున్నారని, ఇంజనీర్లు ముందే లోపాలను హెచ్చరించినా చర్యలు తీసుకోలేదని అన్నారు.

మూడున్నరేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడం క్షమించరాని నేరమని సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శించారు. 2020లోనే ప్రాజెక్టు లోపాలను ఇంజనీర్లు సూచించారని, అక్టోబర్‌ 21న పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినా కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. మేడిగడ్డ చుట్టూ పోలీసులు కాపలా పెట్టి లోపాలు బయటపడకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తుమ్మిడి హెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చినది కేసీఆర్‌ తప్పని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రూ.19,879 కోట్లు ఖర్చు అయ్యాయని, ఇంకా రూ.60 వేల కోట్ల భారం ఉందని చెప్పారు. ప్రజల సొమ్ముతో చేసిన ఈ దోపిడీకి కేసీఆర్‌, హరీశ్‌రావు శిక్షించబడాలని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

Internal Links:

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

పాట్నాలో తీవ్ర ఉద్రిక్తత..

External Links:

రాళ్లతో కొట్టలేదు, నడి రోడ్డులో ఉరి వేయలేదు.. కేసీఆర్‌పై సీఎం ఫైర్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *