ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం వెల్లడించింది.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఫిబ్రవరి 5న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఫిబ్రవరి 12లోపు వివరణ ఇవ్వాలని పేర్కొంది. అయితే తీన్మార్ మల్లన్న నుంచి ఎలాంటి వివరణ రాలేదు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణా సంఘం చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *