హైదరాబాద్: తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి మరో షాక్ తగిలింది, ఆ పార్టీకి చెందిన పటాన్చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే జి.మహిపాల్రెడ్డి సోమవారం అధికార పార్టీ కాంగ్రెస్లో చేరారు. పటాన్చెరు ఎమ్మెల్యే జి.మహిపాల్రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. మంత్రులు దామోదర రాజనరసింహ, పి.శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్కు మారి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి విఫలమైన కాంగ్రెస్ మాజీ నేత గాలి అనిల్కుమార్ కూడా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి కాంగ్రెస్లోకి లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరింది. ప్రస్తుతం ఎమ్మెల్యే జి.మహిపాల్రెడ్డి సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరగా తాజాగా మహిపాల్ రెడ్డి రావడంతో ఈ సంఖ్య నాలుగుకి చేరింది.