రాజన్న సిరిసిల్లలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ కార్యకర్తలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ నేతలను కాంగ్రెస్ నేతలే చంపేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచిత కరెంటు పేరుతో , కరెంటు కోత పెట్టే ప్రయత్నం చేసిందన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాల జీవనోపాధి నాశనమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ, అంబానీ లకు సిరిసిల్ల నేతన్న లకి ఒకే కేటగిరి ఎలా? అని అడిగాడు. దేశంలో 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చాం, పైసా పెంచలేదని గుర్తు చేశారు. ఇప్పుడు కరెంట్‌ కోతలతో కరెంటు ఛార్జీలు భారంగా మారాయి. గత 10 ఏళ్లలో ఆత్మహత్యలు లేవని, 10 నెలల్లో 10 మంది చనిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి మనసు మార్చుకోవాలని కేటీఆర్ సూచించారు.

దీపావళి ముందే బాంబులు పేలుతాయని పొంగులేటి కామెంట్స్ పై అయన పై జరిగిన ఈడి రైడ్స్ గురించి చెప్తాడు కావచ్చని తెలిపారు. ఏం చేస్తారో చేసుకోండి, ఏం పిక్కుకుంటారో పిక్కుకోండని సంచలన వ్యాఖ్యలు చేశారు. గీ చిట్టి నాయుడు ఏం చేస్తాడు హౌల గాళ్ళకి భయపడుతానా అని కీలక వ్యాఖ్యలు చేశారు. చిల్లర కేసు పెట్టీ జైలుకి పంపిస్తారు కావచ్చు అంతే అని అన్నారు. ఒర్జినల్ బాంబులకి భయపడలేదు, గీ సుతిల్ బాంబులకు భయపడనని కేటీఆర్ అన్నారు. జగిత్యాల ఎంఎల్ఏ సంజయ్ పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. మోడీ నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని కేటీఆర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *