శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అనుర కుమార దిస నాయకే విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈరోజు ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టారు. శనివారం జరిగిన త్రిముఖ పోరులో శ్రీలంక ఓటర్లు అనుర కుమారకే పట్టం కట్టారు. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా నేడు అనుర కుమార దిస నాయకే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో దిసనాయకే ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య ప్రమాణ స్వీకారం చేయించారు. సమగి జన బలవేగయ (ఎస్‌జేబీ) నేత సాజిత్‌ ప్రేమదాసపై దిసనాయకే గెలిచారు. ఇక లంక‌కు 9వ అధ్యక్షుడిగా ఇవాళ ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. మార్కిస్ట్‌ పార్టీ నేతగా గెలిచిన అనుర కుమార దిస నాయకే తాను ఎన్నికల ప్రచారంలో శ్రీలంకలో సమూల మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రజలు ఆయనకు పట్టం కట్టడంతో నేటి నుంచి శ్రీలంకలో మార్కిస్ట్‌ల పాలన ప్రారంభం కానుంది. ఇటీవల శ్రీలంకలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం అనంతరం జరిగిన ఎన్నికల్లో అనుర కుమార దిస నాయకే ఘన విజయం సాధించారు. అయితే రెండో రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత మాత్రమే అనుర కుమార దిస నాయకేను అధికారికంగా ఎన్నికయినట్లు ప్రకటించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *