ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్టు అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరూ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా బాధ్యతలు చేపట్టారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీలుగా వారిచే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌గౌడ్‌, విప్‌ బీర్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన కోదండరామ్, అలీఖాన్‌లకు పలువురు రాజకీయ నేతలు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *