హెచ్‌సియు భూ సమస్యపై కాంగ్రెస్ నాయకుల కీలక సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు హెచ్‌సియు భూములకు సంబంధించి ప్రభుత్వం నియమించిన క్యాబినెట్ కమిటీ సభ్యులు, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రణాళిక శాఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో మంత్రి సమావేశం అవుతారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ భవన్‌లో మీనాక్షి నటరాజన్ NSUI నాయకులతో సమావేశం కానున్నారు.

ఇప్పటికే ముగ్గురు మంత్రులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. సీఏస్ ,రెవెన్యూ ,జీహెచ్ఎంసీ,అటవీ ,హెచ్ఎండీఏ ఇతర ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం అయ్యారు. ఒకటి రెండు రోజుల్లో విద్యార్థి సంఘాలు, పౌర సంఘాలు, పర్యావరణ వేత్తలతో మంత్రుల కమిటీ సమావేశం కానుంది. ఈ నెల 16 వరకు నివేదిక ఇవ్వాలని సీఎస్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో నివేదిక తయారీపై సీఎస్ ఫోకస్ పెట్టారు. కంచ గచ్చిబౌలిలో ఎకో పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వ ఆలోచన చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *