బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది. ఫార్ములా రేసులో అవినీతికి పాల్పడి తనపై ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని క్వాష్నూతు కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫార్ములా ఈ రేసులో అవినీతి జరిగిందంటూ ఏసీబీ తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం ఉదయం కేటీఆర్ క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది. ఏసీబీ వాదనల అనంతరం ఈ తీర్పు వెలువడింది.
ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ నిబంధనలను ఉల్లంఘించి ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా విదేశాలకు తరలించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని రూ.55 కోట్లు చెల్లించాలని కేటీఆర్ మౌఖికంగా చెప్పడంతో అధికారులు ఈ మేరకు చెల్లింపులు చేసినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది.