హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద బీజేపీ భారీ ధర్నా నిర్వహించనుంది. మూసీ పునరుద్ధరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ ఇందిరాపార్కు వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. ఈ ధర్నాలో మూసీ బాధితులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ధర్నా చౌక్ వేదికగా బాధితులతో కలిసి మహా ధర్నా నిర్వహించనున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, మూసీ బాధితులు పాల్గొననున్నారు.
అలాగే ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతామని బీజేపీ తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఇచ్చిన హామీ రూ.2 లక్షలు రుణ మాఫీ పూర్తిగా అమలయ్యే వరకు వదలబోమన్నారు. బీఆర్ఎస్ తరహాలో మోసాలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. లక్ష మంది రైతులకు అండగా నిలుస్తామని ప్రకటించారు. రూ.2 లక్షల రుణమాఫీపై ఎందుకు ఆంక్షలు ఎందుకు విధించారని? ప్రశ్నించారు. రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, రైతులను దారుణంగా మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎంత మంది రైతులకు రుణమాఫీ చేశారో అధికారిక ప్రకటన విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ పై ధర్నా చేపట్టనుంది.