హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ఉల్ హాసన్ 63 ఓట్లు సాధించి, బీజేపీ అభ్యర్థి గౌతమ్రావుపై 38 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి, ఇందులో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్-అఫీషియో సభ్యులు ఓటేశారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ క్రాస్ ఓటింగ్పై ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఆశించిన ఫలితం రాలేదు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్-అఫీషియో సభ్యులు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈ విజయంతో ఎంఐఎం స్థానిక సంస్థలపై తమ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది.