మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రమాదం తప్పింది. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా భూ భారతి చట్టం-2025పై అవగాహన సదస్సు కోసం మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లు రవి, సంపత్ కుమార్ హెలికాప్టర్లో ప్రయాణించారు.
కలెక్టరేట్ ప్రాంగణంలో హెలికాప్టర్ ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేయడంతో కింద ఉన్న గడ్డిపై పడి అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు మంటలను ఆర్పివేశారు. దీంతో మంత్రి పొంగులేటి, కాంగ్రెస్ నాయకులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.