తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు ఉదయం 9:15 నుండి 11:30 గంటల మధ్య మండలి ప్రాంగణంలో జరగనుంది. కొత్తగా ఎన్నికైన ఎనిమిది మంది ఎమ్మెల్సీలతో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, కేతావత్ శంకర్ నాయక్ ఉన్నారు. సీపీఐ తరపున నెల్లికంటి సత్యం ప్రమాణ స్వీకారం చేయనుండగా, బీజేపీ తరపున మల్కా కొమురయ్య, అంజి రెడ్డి ఉన్నారు. అయితే, బీఆర్ఎస్ పార్టీ నుంచి కొత్త ఎమ్మెల్సీలుగా ఎన్నికైన దాసోజు శ్రవణ్ కుమార్, శ్రీపాల్ రెడ్డిల ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *