రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అధికారులను నియమించారు. ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ ఆసుపత్రిని ఆదివారం ఆయన సందర్శించారు. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలపై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ను అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి ఉన్నారు.