చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారి హెలిప్యాడ్‌కు  చేరుకున్నారు. అతను వైమానిక దళం హెలికాప్టర్‌లో దేశంలోని దక్షిణ కొనకు చేరుకున్నాడు. కాసేపు విశ్రాంతి కోసం ప్రభుత్వ అతిథి గృహానికి  చేరుకున్నారు ప్రధాని మోదీ, ఆ తర్వాత కన్యాకుమారి దేవి ఆలయంలో ప్రార్థనలు చేసారు.
తమిళ సాంస్కృతిక చిహ్నం మరియు సాధువు అయిన తిరువల్లువర్ విగ్రహం ముందు కూడా ఆయన నీవాళ్ళు అర్పించరు.
ప్రధాన మంత్రి కన్యాకుమారి ప్రధాన భూగం నుండి వివేకానంద రాక్ మెమోరియల్‌కు ఫెర్రీలో వెల్లారు.
మే 30 నుంచి జూన్ 1 వరకు మూడు రోజుల పాటు వివేకానంద రాక్ మెమోరియల్‌లో ఉండే ఆయన రాక్ మెమోరియల్‌లోని ధ్యాన మందిరంలో 45 గంటల పాటు ధ్యానం చేయనున్నారు.
కన్యాకుమారిలో ప్రధానమంత్రి ధ్యాన కార్యక్రమానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కాంగ్రెస్ మరియు సీపీఐ-ఎం రంగంలోకి దిగాయి మరియు ఆయన ధ్యానం చేయడానికి అనుమతించవద్దని కాంగ్రెస్ భారత ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాసింది.
ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రధానమంత్రి ధ్యాన కార్యక్రమానికి ఎన్నికల సంఘం అనుమతించరాదని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె. సెల్వపెరుంతగై అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *