నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు రానున్నారు. హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా 21వ స్నాతకోత్సవంకి రాష్ట్రపతి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో నిన్న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పోలీస్‌, రెవెన్యూ, ఆర్‌ అండ్‌ బీ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక, అటవీ, విద్యుత్‌, తదితర శాఖల ఏర్పాట్లపై కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం రాష్ట్రపతి నిలయంలో ఎనిమిది రోజులపాటు నిర్వహించే ఈశాన్య రాష్టాల భారతీయ కళా మహోత్సవంను ప్రారంభించనున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, నల్సార్ ఛాన్సలర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నర్సింహులు హాజరుకానున్నారు. కాగా, రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మంత్రి సీతక్క రాష్ట్రపతికి స్వాగతం పలికినప్పటి నుంచి నగరం నుంచి వెళ్లే వరకు రాష్ట్రపతి వెంటే సీతక్క ఉండనున్నారు. రాష్ట్రపతి పర్యటించే ప్రాంతాలపై రహదారులపై ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నం కాకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పటిష్టమైన పోలీస్ బందోబస్తును పర్యవేక్షించాలని పోలీసులకు ఆదేశించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *