గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ ను కోర్టు మరోసారి పొడిగించింది. వల్లభనేని వంశీని ఈరోజు జైలు అధికారులు వర్చువల్‌గా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. వంశీ రిమాండ్ ను మార్చి 25 వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనూ వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులోనూ ఆయన రిమాండ్ లో ఉన్నారు. కోర్టు అతనికి ఈ నెల 15 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో రిమాండ్ ముగిసిన వెంటనే వంశీని ఇదే విధంగా ఆన్‌లైన్ పద్ధతిలో కోర్టులో హాజరు పరుస్తారని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *