హైదరాబాద్‌లోని సచివాలయం ముందు ఏర్పాటు చేయనున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తాము తెలంగాణలో తిరిగి అధికారంలోకి రాగానే తొలగిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారం పోయిన కూడా బీఆర్ఎస్ నేతలకు ఇంకా అహంకారం తగ్గలేదని విమర్శించారు. అనవసర ఆరోపణలు చేస్తే బీఆర్ఎస్ నేతలను తెలంగాణ సమాజం బహిష్కరిస్తుందని హెచ్చరించారు. డిసెంబర్ 9 లోపు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తదితరులు పంజాగుట్టలోని రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ శంలో విప్లవాత్మక మార్పులకు రాజీవ్ గాంధీ శ్రీకారం చుట్టారన్నారు. దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలు రాజీవ్ గాంధీ హయాంలోనే బలోపేతమయ్యాయని పేర్కొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *