మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ కు తీవ్ర అవమానం జరిగింది. ప్రొఫెసర్ సాయిబాబా బౌతిక కాయానికి నివాళులు అర్పించటానికి వచ్చిన కేటీఆర్ ను అడ్డుకున్నారు ఉద్యమకారులు, పౌరహక్కుల సంఘం నేతలు. కేటీఆర్ గో బ్యాక్, కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు, ఉద్యమకారులను, పౌరహక్కుల నేతలను ఉక్కుపాదం కింద పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపా లాంటి తీవ్రమైన కేసులు పెట్టి జైళ్లలో పెట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్, కోదండరామ్, విమలక్కలపై కేసులు పెట్టి జైలుకు పంపిన చరిత్ర బీఆర్‌ఎస్ పార్టీకి ఉందన్నారు.

కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఉద్యమకారులు, హక్కుల నేతలు, కార్యకర్తలను తీవ్రంగా అణచివేసింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు ఉద్యమ, హక్కుల కార్యకర్తలు. ఉద్యమకారుల ఆగ్రహంతో, గో బ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నా కేటీఆర్ మౌనంగా ఉన్నారు. నివాళులు అర్పించి మౌనంగా వెనుదిరిగారు. కనీసం సమాధానం కూడా చెప్పలేకపోయారు కేటీఆర్. తీవ్ర అవమానం, చేదు అనుభవంతో అక్కడి నుంచి వచ్చేశారు కేటీఆర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *