నేడు తెలుగుదేశం పార్టీ 43వ వ్యవస్థాపక దినోత్సవం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో వేడుకలు జరుగుతున్నాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఉదయం హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్ను సందర్శించనున్నారు.
అక్కడ ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం టీడీపీ జెండాను ఎగురవేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయం దగ్గర జరిగే వేడుకల్లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఇతర నాయకులు పాల్గొంటారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.
అయితే, తెలుగు దేశం పార్టీని 1982 మార్చి 29వ తేదీన దివంగత ఎన్టీ రామారావు స్థాపించారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని పెంపొందించడంతో పాటు పేదలు, రైతులు, మధ్య తరగతి వర్గాలకు అండగా నిలవడమే ఈ పార్టీ ప్రధాన లక్ష్యంగా ఏర్పడింది. ఇక, తన 43 ఏళ్ల ప్రస్థానంలో టీడీపీ ఐదుసార్లు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది.. అలాగే, రాష్ట్రంలో అత్యంత విజయవంతమైన పొలిటికల్ పార్టీగా ఉంది. ప్రస్తుతం చంద్రబాబు నేతృత్వంలో ఏపీలో పాలన కొనసాగిస్తుంది ఈ పార్టీ.