ఒక పార్టీ బీఫాంతో ఎన్నికల్లో పోటీచేసి, గెలిచాక మరో పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందేనని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. తెలంగాణలో బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చింది. వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారో చెప్పాలని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ప్రశ్నించింది. ఈ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందుంచాలని అసెంబ్లీ సెక్రెటరీకి ఆదేశాలు జారీ చేసింది.
పిటిషన్లను పరిశీలించి వాటి విచారణ షెడ్యూల్ను విడుదల చేయాలని స్పీకర్ను ఆదేశించింది. సదరు ఎమ్మెల్యేలకు ఎప్పుడు నోటీసులు జారీ చేస్తారు, ఎప్పుడు వాదనలు వింటారు, ప్రొసీడింగ్స్ ఎప్పుటిలోగా పూర్తిచేస్తారు. మిగతా వివరాలన్నీ ఈ షెడ్యూల్లో పేర్కొనాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం నాలుగు వారాల గడువు ఇచ్చింది. అప్పటికీ షెడ్యూల్ విడుదల చేయకుంటే ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరిస్తామని హెచ్చరించింది.