టీపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం “చలో రాజ్భవన్” కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఏఐసీసీ పిలుపు మేరకు అదానీ ఆర్థిక అవకతవకలు, నేరారోపణలు, అవినీతి, మోసం, మనీ లాండరింగ్ వంటి అంశాలతో పాటు మణిపూర్ అల్లర్లు, విధ్వంసాలపై మోదీ సర్కార్ వైఖరిని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఏఐసీసీ. దేశవ్యాప్తంగా ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీసీసీ చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ర్యాలీని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన రోడ్డుపై బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మోదీ, అదానీ జోడీ దేశ ప్రజలారా కళ్లు తెరవండి అంటూ సీఎం రేవంత్రెడ్డి ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపారు.