టీపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం “చలో రాజ్‌భవన్” కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఏఐసీసీ పిలుపు మేరకు అదానీ ఆర్థిక అవకతవకలు, నేరారోపణలు, అవినీతి, మోసం, మనీ లాండరింగ్ వంటి అంశాలతో పాటు మణిపూర్ అల్లర్లు, విధ్వంసాలపై మోదీ సర్కార్ వైఖరిని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఏఐసీసీ. దేశవ్యాప్తంగా ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీసీసీ చలో రాజ్‌భవన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఆధ్వర్యంలో నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్‌భవన్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ర్యాలీని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన రోడ్డుపై బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మోదీ, అదానీ జోడీ దేశ ప్రజలారా కళ్లు తెరవండి అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *