Ind Vs Eng Fifth Test Thriller: ఓవల్ వేదికగా ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య ఐదవ టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా ముగింపు దిశగా సాగుతోంది. ఆట చివరి రోజుకు చేరుకోవడంతో ఇంగ్లండ్కు విజయానికి కేవలం 35 పరుగులు కావాల్సి ఉంది, భారత్కు మాత్రం మరో నాలుగు వికెట్లు అవసరం. వర్షం కారణంగా నాలుగో రోజు ఆట ముందే ముగియగా, జేమీ స్మిత్ (2), జేమీ ఒవర్టన్ (0) క్రీజులో ఉన్నారు. గాయపడిన క్రిస్ వోక్స్ బ్యాటింగ్కు రాకపోతే భారత్కు మూడు వికెట్లే సరిపోతుంది. తాజా పరిస్థితుల్లో నేటి మొదటి సెషన్ అత్యంత కీలకంగా మారింది. భారత్ విజయం సాధిస్తే సిరీస్ను 2–2తో సమం చేయగలదు.
నాలుగో రోజు ఆటలో భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ధాటిగా ఛేదించే ప్రయత్నం చేసింది. తొలుత డకెట్ (54), పోప్ (27) త్వరగా అవుటైనా, బ్రూక్ (111) మరియు రూట్ (105) శతకాలతో ఇంగ్లండ్ను గెలుపు దిశగా నడిపించారు. అయితే బ్రూక్ను ఆకాశ్ దీప్ అవుట్ చేయగా, ప్రసిద్ధ్ వరుస ఓవర్లలో బెతెల్ (5), రూట్లను ఔట్ చేసి భారత్ను మళ్లీ పోటీలోకి తీసుకువచ్చాడు. ఆ తర్వాత భారత పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో జేమీ స్మిత్, ఒవర్టన్లు పరుగులు చేయడంలో తడబడారు. వెలుతురులేమి, వర్షం వల్ల నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. మిగిలిన ఓవర్లలో టీమిండియా బౌలర్లు విజృంభిస్తే మ్యాచ్ గెలవొచ్చే అవకాశముంది.
Internal Links:
4 వికెట్లతో చెలరేగిన సిరాజ్, ప్రసిద్ కృష్ణ…
ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో తడబడిన టీమిండియా..
External Links:
రసవత్తర ముగింపు దిశగా ఐదో టెస్ట్.. భారత్కు 4 వికెట్లు, ఇంగ్లండ్కు 35 పరుగులు!