India vs England Test Series: సీనియర్ భారత బ్యాటర్ చెతేశ్వర్ పుజారా మరోసారి జాతీయ జట్టులో స్థానం సంపాదించాలని ఆశిస్తూ, తాను క్రికెట్కు ఎప్పుడూ దగ్గరగానే ఉన్నానని తెలిపారు. క్రికెట్ ఆడటాన్ని కొనసాగిస్తానని, భారత్ తరఫున మళ్లీ ఆడే అవకాశం తనకు గర్వకారణమవుతుందని పేర్కొన్నారు. సెలెక్షన్ విషయంలో తనకు ఉన్న నియంత్రణ ఏమీలేదని, కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండానే తన సాధనపై దృష్టిపెడతానని వెల్లడించారు. గత ఏడాది జూన్లో ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన పుజారా, ప్రస్తుతం దేశీయ క్రికెట్లో నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ తన ఆటతీరును మెరుగుపరుచుకుంటున్నాడు. తన ఫిట్నెస్ను కాపాడుకుంటూ, స్పష్టమైన లక్ష్యాలపై దృష్టిపెట్టి ముందుకు సాగుతున్నానని పేర్కొంటూ, భారత్ తరఫున మళ్లీ ఆడే దశకు సిద్ధంగా ఉంటానని చెప్పారు.
India vs England Test Series
ఇటీవల ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడుతూ పుజారా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ పిచ్లు, వాతావరణం కొత్త ఆటగాళ్లకు సవాలుగా మారతాయని పేర్కొంటూ, మొదటి టెస్టుకు ముందు తగిన సిద్ధత చాలా అవసరమని తెలిపారు. ఇంగ్లండ్ జట్టులో జో రూట్, హ్యారీ బ్రూక్ వంటి కీలక ఆటగాళ్లను తొందరగా ఔట్ చేయడమే విజయానికి మార్గమని అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఇంగ్లండ్ బజ్బాల్ ఆటశైలికి బుమ్రా బలమైన ప్రతిస్పందన ఇస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత జట్టులో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేస్తే తప్పకుండా విజయం సాధించవచ్చని పుజారా అభిప్రాయపడ్డారు.
Internal Links:
ICC వన్డే ర్యాంకింగ్స్ టాప్లో టీమిండియా స్టార్ ఓపెనర్..
నెదర్లాండ్స్, నేపాల్ మధ్య T20 మ్యాచ్…
External Links:
సెలెక్షన్ నా చేతుల్లో లేదు.. ఇప్పటికీ ఆడేందుకు సిద్ధం: సీనియర్ బ్యాటర్