దంబుల్లా: బ్యాటింగ్ లో రాణిస్తున్న శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు మహిళల ఆసియాకప్ లో సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. బుధవారం జరిగిన చివరి గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో లంక 10 వికెట్ల తేడాతో థాయ్‌లాండ్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచిన థాయ్‌లాండ్ 20 ఓవర్లలో 93/7 స్కోరు చేసింది. నానాపట్ (47 నాటౌట్) టాప్ స్కోరర్. కావిషా రెండు వికెట్లు తీసింది. అనంతరం శ్రీలంక 11.3 ఓవర్లలో 94/0 స్కోరు చేసి విజయం సాధించింది. విష్మీ గుణరత్నే (39 నాటౌట్), చామరి ఆటపట్టు (49 నాటౌట్) దూకుడుగా ఆడారు. చామరికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 114 పరుగుల తేడాతో మలేషియాపై విజయం సాధించింది. తొలుత బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 191/2 స్కోరు చేసింది. ముర్షిద్ ఖాతున్ (80), నిగర్ సుల్తానా (62 నాటౌట్), దిలారా అక్తర్ (33) రాణించారు. తర్వాత మలేషియా 20 ఓవర్లలో 77/8కి పరిమితమైంది. శుక్రవారం జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌తో భారత్, పాకిస్థాన్‌తో శ్రీలంక తలపడనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *