ప్యారిస్ ఒలింపిక్స్: ఒలింపిక్స్ చరిత్రలో ఫైనల్ చేరిన భారత మహిళా రెజ్లర్‌గా వినేశ్‌ ఫొగాట్‌ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో వినేశ్‌ 5-0తో క్యూబా రెజ్లర్ గుజ్మాన్ లోపెజ్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన వినేష్ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ విజయంతో వినేష్ కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది.

మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగం ఫైనల్లో టోక్యో కాంస్య విజేత, అమెరికా స్టార్ రెజ్లర్ సారా హిల్డర్‌ బ్రాంట్‌తో వినేశ్‌ ఫొగాట్‌ తలపడనుంది. బుధవారం రాత్రి 11.23 గంటలకు మ్యాచ్ జరగనుంది. వినేశ్‌ స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. బంగారు పతకం తెస్తానని వినేష్ తన తల్లికి మాట ఇచ్చింది. సెమీస్ విజయం తర్వాత వినేశ్‌ తన తల్లితో వీడియో కాల్‌లో మాట్లాడారు. ఈ సమయంలో వినేష్ తన కుటుంబ సభ్యులకు ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చి భావోద్వేగానికి గురైంది. వీడియో చివర్లో, ఆమె తన తల్లితో, ‘గోల్డ్ లానా హై’ (నేను బంగారం తెస్తాను) అని చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *