Womens World Cup 2025

Womens World Cup 2025: భారత మహిళల జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ వన్డే ప్రపంచకప్‌ 2025ను గెలిచి ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు ముగింపు పలుకుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచకప్‌ ఎల్లప్పుడూ ప్రత్యేకమని, ఈసారి తప్పక విజయం సాధిస్తామని చెప్పారు. 2017 ప్రపంచకప్‌ సెమీస్‌లో ఆస్ట్రేలియాతో ఆడిన తన 171 పరుగుల ఇన్నింగ్స్‌ తన కెరీర్‌లో మలుపు తీసుకువచ్చిందని, ఆ మ్యాచ్‌ తర్వాత చాలా మార్పులు జరిగాయని గుర్తుచేశారు. యువరాజ్‌ సింగ్‌ నుంచి ప్రేరణ పొందుతానని పేర్కొన్నారు. సోమవారం ముంబైలో ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఐసీసీ ఛైర్మన్‌ జై షా, మాజీ ఆటగాళ్లు యువరాజ్‌సింగ్‌, మిథాలీ రాజ్‌లతో పాటు హర్మన్‌ప్రీత్‌, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌ పాల్గొన్నారు. మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ ఆడటం మాకు లాభదాయకమని ఆమె అన్నారు.

మరో 50 రోజుల్లో ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్‌ సెప్టెంబరు 30 నుంచి నవంబరు 2 వరకు భారత్‌, శ్రీలంకల్లో జరుగనుంది. సెప్టెంబరు 14 నుంచి 20 వరకు మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా భారత్‌ పర్యటించనుంది. ఇప్పటివరకు భారత మహిళల జట్టు వన్డే లేదా టీ20 ప్రపంచకప్‌ గెలవలేదు, కానీ విజయానికి దగ్గరగా వెళ్లి తుది అడ్డంకి వద్ద ఓడిపోయింది. 2017లో భారత్‌ రన్నరప్‌గా నిలిచిన తర్వాత, ఈ ఏడాది ఐసీసీ ట్రోఫీని గెలవాలని జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.

Internal Links:

మహిళల వన్డే ప్రపంచకప్ 2025 – కౌంట్‌డౌన్ ప్రారంభం!

ఇజ్రాయెల్ దాడిలో పాలస్తీనా నంబర్-1 ఫుట్‌బాల్ ప్లేయర్ మృతి..

External Links:

అన్ని మారాయి.. వన్డే ప్రపంచకప్‌ తప్పక గెలుస్తాం: టీమిండియా కెప్టెన్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *