నేడు భారత్ తమ నాలుగో టీ20 మ్యాచ్ జింబాబ్వేతో హరారేలో తలపడనుంది. ఈ టీ20 సిరీస్ కి శుభం గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. భారత్ జింబాబ్వేతో 5 మ్యాచ్లు ఆడనుంది. హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్లో బుధవారం జరిగిన ఐదు మ్యాచ్ల T20I సిరీస్లోని మూడవ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ యొక్క మూడు వికెట్లు తీసి జింబాబ్వేను 159/6కి పరిమితం చేయడంతో భారత్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు సారథి శుభ్మాన్ గిల్ అర్ధ సెంచరీతో రుతురాజ్ గైక్వాడ్ మరియు యశస్వి జైస్వాల్లతో కలిసి భారత్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత భారత్ 182/4కి చేరుకుంది.వరుస విజయాలతో దోసుకొస్తున్న భారత్ నేడు మూడో విజయాన్ని తమ కతాలో వేసుకోగలదా . ఈ యువ ఆటగాళ్లు ఎవరెవరు ఎలా రాణిస్తారో వేచి చూడాల్సిందే. ఈ మ్యాచ్ సాయంత్రం 4.30 గంటలకు ప్రత్యక్ష ప్రసారాన్ని సోనీ లైవ్ టీవిలో వీక్షించవచ్చు.
భారత జట్టు: శుభమన్ గిల్ (సి), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్ (w), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, తుషార్ దేశ్పాండే, యశస్వి జైస్వాల్ , శివమ్ దూబే.
జింబాబ్వే జట్టు: ఇన్నోసెంట్ కైయా, వెస్లీ మాధేవెరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(సి), జోనాథన్ క్యాంప్బెల్, క్లైవ్ మదాండే(w), వెల్లింగ్టన్ మసకద్జా, ల్యూక్ జోంగ్వే, బ్లెస్సింగ్ ముజారబానీ, టెండై చటారా, బ్రాండన్ మవుతా, తనివాన్ మవుతా, , అంటుమ్ నఖ్వీ.