యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఫిబ్రవరి 19 నుంచి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఆలయ అర్చకులచే స్వస్తివాచనం, విశ్వక్సేన పూజతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 20న ద్వజారోహణం, ఫిబ్రవరి 21న సింహవాహన సేవ నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 22న ఆలయంలో హనుమత్ వాహన సేవ, అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 23న గరుడ వాహన సేవ, రథోత్సవం. ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్థం.. ఫిబ్రవరి 25న మహా పూర్ణాహుతి నిర్వహించడంతో వార్షిక బ్రహ్మోత్సవం ముగుస్తుంది. వార్షిక బ్రహ్మోత్సవాలలో, అన్ని రోజులలో సాయంత్రం భక్తి మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి.