Latest News Telugu

News5am, Breaking Online Telugu News (24-05-2025): తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి పుష్కరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద నిర్వహిస్తున్న పుష్కరాలు ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి. ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన పుష్కరాలు ఈ నెల 26వ తేదీ వరకు జరగనున్నాయి. పుష్కరాలను పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానం ఆచరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తున్నారు. నదిలో తర్పణాలు, దీపాలు వదులుతున్నారు. అనంతరం ఆ కాళేశ్వర ముక్తిశ్వరుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు కల్పించింది. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులు నడుపుతుంది. భక్తులకు పుష్కర ఘాట్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం తాగునీటి వసతి, అన్నదానం సైతం చేస్తున్నారు.

More Latest News Telugu:

Breaking Online Telugu News:

తిరుమల తిరుపతి దేవస్థానం సులభ దర్శనం కోసం AI టెక్నాలజీని ఉపయోగించనుంది

ఛార్ధామ్ యాత్ర నిలిపివేత..

More Latest News Telugu: External Sources

సరస్వతీ పుష్కరాలు ఇంకా 4 రోజులే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *