karthika masam pujas begin: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం వేడుకలు బుధవారం ప్రారంభమవుతున్నాయి. నెలరోజుల పాటు భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. ప్రతి సోమవారం స్వామి, పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఏకాదశి తిథిన సత్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. నవంబర్ 2న రుక్మీణి విఠలేశ్వరస్వామికి పంచోపనిషత్ అభిషేకం, శ్రీ కృష్ణతులసి కల్యాణం జరుగుతుంది. నవంబర్ 4న వైకుంఠ చతుర్ధశి సందర్భంగా అనంత పద్మనాభ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వాములకు మహా పూజలు, ఊరేగింపులు ఉంటాయి. నవంబర్ 5న కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం, నిశీపూజ, రాజన్నకు మహాపూజ నిర్వహిస్తారు. నెలంతా ఆలయంలో ఉదయం కార్తీక పురాణ ప్రవచనం జరుగుతుంది. నవంబర్ 20న కార్తీక మాసం ముగుస్తుంది.
పురాణాల ప్రకారం, పరమశివుడికి కార్తీక మాసం ఎంతో ప్రీతికరమైనది. ఈ నెలలో నోములు, వ్రతాలు, దీపారాధనలు, అభిషేకాలు చేయడం శుభప్రదం. లక్షపత్రి పూజలు, బిల్వార్చనలు పాప విమోచనానికి దోహదం చేస్తాయని అర్చకులు చెబుతున్నారు. దీపావళి సందర్భంగా కరీంనగర్లోని శ్రీమహాశక్తి దేవాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ధనత్రయోదశి రోజు అమ్మవార్లకు నాణాలు, పూలతో పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని కరెన్సీ నోట్లు, గాజులు, కుంకుమతో అలంకరించి, దీపావళి లక్ష్మి కుబేర హోమం సందర్భంగా భక్తులకు ఆశీర్వాదాలు అందజేశారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..