లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. 200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి జాతర తెలంగాణతో పాటు అనేక రాష్ట్రలో మంచి కీర్తిని పొందింది. ఆదివారం అమ్మవారి బోనాలు మొదలైయ్యాయి. మహంకాళి అమ్మవారి మొదటి రోజు బోనాల ఉత్సవం ప్రశాంతంగా ముగిసింది. నిన్న తెల్లవారు జామున ప్రభుత్వం నుండి తొలి బోనం సమర్పించడంతో అమ్మవారి బోనాల ఉత్సవం ప్రారంభమైంది. లక్షలాది మంది భక్తుల ప్రార్థనలు, వేలాది బోనాల సమర్పణతో మహంకాళి బోనాలు వైభవంగా జరిగాయి. పచ్చని కుండపై నిలబడి ఉన్న జోగిని (స్వర్ణలత) జాతకం చెప్పడం కోసం, భక్తులు ఎదురుచూస్తున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటల తర్వాత ఈ రంగాన్ని అంచనా వేసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *