Pydithalli Ammavaru Sirimanotsavam

Pydithalli Ammavaru Sirimanotsavam: ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. నేడు జరగనున్న సిరిమానోత్సవం కోసం ఆలయ పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూలైన్లలో నీటి సదుపాయాలు, బయో మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. నగరపాలక సంస్థ కూడా పారిశుద్ధ్య పనుల కోసం అదనపు సిబ్బందిని మూడు షిఫ్టుల్లో నియమించింది. హుక్కుం పేటలో భక్తులు సిరిమానుకు పసుపు, కుంకుమ సమర్పిస్తున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలను అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు సమర్పించారు.

ఇక సాయంత్రానికి చీకటి పడకముందే సిరిమానోత్సవం ముగించాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ఊరేగింపు ప్రారంభమవుతుంది. అమ్మవారి ప్రతిరూపంగా సిరిమాను అధిరోహించే పూజారి బంటుపల్లి వెంకటరావు ఈసారి తొమ్మిదోసారి భక్తులను ఆశీర్వదించనున్నారు. ఆయన తండ్రి బంటుపల్లి బైరాగినాయుడు 27 సార్లు సిరిమానుపై అధిరోహించారు. పూర్వం నుంచి పతివాడ, బంటుపల్లి కుటుంబాలే సిరిమానుపై కూర్చోవడం ఆనవాయితీగా వస్తోంది. భద్రతా పరంగా 120 సీసీ కెమెరాలు, 12 డ్రోన్లు ఏర్పాటు చేసి, డాగ్‌ బాంబు స్క్వాడ్‌ బృందాలతో తనిఖీలు జరిపినట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology. It focuses on presenting news in short, easy-to-read formats for quick understanding“.

Internal Links:

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..

External Links:

ఉత్తరాంధ్ర ఇలవేల్పు.. నేడే పైడితల్లి సిరిమానోత్సవం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *