Shiva Deekshas: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శివ దీక్షలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణం “ఓం నమశ్శివాయ” నామస్మరణతో మార్మోగింది. ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో సుమారు 300 మంది భక్తులు శివ మాలధారణ చేశారు. ప్రతి ఏడాది మహాశివరాత్రికి 41 రోజుల ముందు దీక్షలు ప్రారంభించి, శివరాత్రి రోజు మాల విరమణ చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ సంప్రదాయం దాదాపు 35 సంవత్సరాలుగా కొనసాగుతోంది.
శివ దీక్షను అత్యంత పవిత్రమైన దీక్షగా భక్తులు నమ్ముతారు. దీక్షతో కష్టాలు తొలగి సుఖసంతోషాలు లభిస్తాయని విశ్వాసం. శివ దీక్షలు 108, 41, 21 రోజులుగా ఉంటాయి. దీక్ష సమయంలో భక్తులు రోజుకు మూడుసార్లు శివపూజ చేసి, కఠిన నియమాలు పాటిస్తారు. విభూతి, కుంకుమ, చందనం, రుద్రాక్ష మాల ధరించి, నియమ నిష్ఠలతో దీక్ష పూర్తి చేస్తే మంచి ఫలితం లభిస్తుందని అర్చకులు తెలిపారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..
External Links:
వేములవాడ రాజన్న ఆలయంలో ప్రారంభమైన శివదీక్షలు!