Swarnalatha Bhavishavani: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో జూలై 14న జరిగిన రంగం కార్యక్రమం ఘనంగా జరిగింది. అమ్మవారి ప్రతిరూపంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలబడి భక్తులకు పలికిన వాక్యాలు ఆసక్తికరంగా, ఆధ్యాత్మికంగా భావోద్వేగాన్ని కలిగించాయి. ఈ ఏడాది భక్తులు సమర్పించిన బోనాలను అమ్మ సంతోషంగా అందుకున్నా, ప్రతీవేళ ఏదో ఒక ఆటంకం కలుగుతుందని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలను నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారని, అయినా తన బిడ్డలను తాను కాపాడుకుంటానని చెప్పారు. తాను కోపంగా లేనప్పటికీ, పూజలు నిర్వహించాలనే ఆదేశం భక్తులకు ఇచ్చారు.
స్వర్ణలత భవిష్యవాణిలో ప్రతి ఒక్కరు తమ తన అనుభవాన్ని అనుభవించాల్సిందేనని, తాను భక్తులను రక్షిస్తానని, భారతదేశాన్ని, తెలంగాణను కాపాడే బాధ్యత తనదేనని తెలిపారు. ఈ సంవత్సరం వర్షాలు చక్కగా పడతాయని, పంటలు బాగా ఉత్పత్తి అవుతాయని చెప్పారు. అయితే అగ్నిప్రమాదాలు సంభవించనున్నాయని, మహమ్మారి వచ్చేందుకు అవకాశముందని హెచ్చరించారు. తానూ రక్తబలి కోరుతున్నానని, తనకు సంబంధించిన పూజలు సరిగ్గా జరపకపోవడం వల్లే మరణాలు పెరిగుతున్నాయని పేర్కొన్నారు. తనను కొలిచే వారికి ఎలాంటి హానీ కలుగదని, వారిని ఆనందంగా చూసుకుంటానని తెలిపారు. భక్తులు ఈ ఏడాది ఐదు వారాల పాటు పప్పు బెల్లాలతో సాకె పెట్టాలని అమ్మవారు ఆజ్ఞాపించారు.
Internal Links:
External Links:
స్వర్ణలత భవిష్యవాణి: వర్షాలు కురుస్తాయి.. అగ్ని ప్రమాదాలు జరుగుతాయి.. మహమ్మారి వేధిస్తుంది.