Tirumala Laddu Sales

Tirumala Laddu Sales: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ ఏడాది తిరుమల తిరుపతి దేవస్థానాలు (TTD) లడ్డూ విక్రయాల్లో చరిత్రలోనే రికార్డు సృష్టించింది. 2025లో మొత్తం 13 కోట్ల 52 లక్షల లడ్డూలు విక్రయమయ్యాయి. గత ఏడాది కంటే ఈసారి కోటి 37 లక్షల లడ్డూలు ఎక్కువగా అమ్ముడయ్యాయి. ఇది శ్రీవారిపై భక్తుల విశ్వాసం పెరగడం, ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరగడం, ప్రసాదానికి ఉన్న డిమాండ్ పెరిగినదానికి నిదర్శనం అని అధికారులు తెలిపారు.

ప్రత్యేకంగా వైకుంఠ ద్వార దర్శనాలు, పండుగలు, సెలవు రోజుల్లో లడ్డూ విక్రయాలు భారీగా పెరిగాయి. డిసెంబర్ 28, 2025న ఒక్కరోజే 5 లక్షల 12 వేల లడ్డూలు విక్రయమై సింగిల్ డే రికార్డుగా నిలిచాయి. భక్తులకు ఎలాంటి కొరత లేకుండా రోజుకు సగటున 3.5 నుంచి 4 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నామని, అవసరమైతే మరింత పెంచుతున్నామని TTD తెలిపింది. లడ్డూ నాణ్యత, పవిత్రతపై ఉన్న విశ్వాసం వల్లే ఈ రికార్డులు సాధ్యమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. కొత్త ఏడాదిలో లడ్డూ తయారీ, పంపిణీ వ్యవస్థను మరింత మెరుగుపరచి భక్తులకు మంచి సేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..

External Links:

రికార్డు సృష్టించిన శ్రీవారి లడ్డూ విక్రయాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *