News5am, Breaking News Latest Headlines (06-06-2025): ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు మళ్లీ సురక్షితమైన పెట్టుబడులైన బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ప్రభావంతో బంగారం ధరలు మళ్లీ గణనీయంగా పెరుగుతున్నాయి.
నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.400 వరకు పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.99,610 వద్ద ఉంది.
కొన్ని నగరాల్లో ఇది లక్ష రూపాయల మార్క్ను దాటింది. తులం బంగారం కొనుగోలు చేస్తే, జీఎస్టీ మరియు ఇతర ఛార్జీలతో కలిపి మొత్తం ధర లక్ష రూపాయల కన్నా ఎక్కువవుతుంది. ప్రస్తుతం 10 గ్రాములకు రూ.91,130గా నమోదైంది.
బంగారం మాత్రమే కాదు, వెండి ధరలోనూ భారీ పెరుగుదల కనిపిస్తోంది. నిన్న ఒక్కరోజే వెండి ధర రూ.3,000 కంటే ఎక్కువగా పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,14,100 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్లో బంగారం ధరలు – తాజా సమాచారం
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹91,130
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹99,610
Read More Breaking News:
Breaking News Latest Headlines
తొక్కిసలాట కలకలం: ఆర్సిబి ఉద్యోగిని అరెస్టు చేసిన పోలీసులు
అయోధ్యలో రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ట..
More Telugu News: External Sources
మహిళలకు దిమ్మదిరిగే షాక్.. మళ్లీ లక్ష రూపాయలకు చేరుకున్న బంగారం ధర