మొబైల్ టారిఫ్ల పెంపుపై ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ స్పష్టతనిచ్చింది. వివిధ కంపెనీలు మొబైల్ టారిఫ్లు పెంచిన నేపథ్యంలో ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ టారిఫ్ పెంచే ప్రణాళిక లేదని తేల్చిచెప్పింది. సమీప భవిష్యత్తులో టారిఫ్లు పెంచబోమని కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తదితర ప్రైవేటు ఆపరేటర్లు ఇటీవల టారిఫ్ను పెంచాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ నెట్ వర్క్ టారిఫ్ పెంపుపై పై విధంగా స్పందించి. సమీప భవిష్యత్తులో టారిఫ్ పెంపు ఉండదని బీఎస్ఎన్ఎల్ చైర్మన్, ఎండీ రాబర్ట్ రవి వెల్లడించారు. వినియోగదారుల సంతోషం, వారి విశ్వాసాన్ని గెలుచుకోవడం తమకు ప్రధాన లక్ష్యమన్నారు. ఈ క్రమంలో సమీప భవిష్యత్తులో పెంపు ఉండదని స్పష్టం చేశారు.