Gold and Silver Cost: 2025 దసరా, దీపావళి సీజన్లో బంగారం కొనుగోలుదారులకు షాక్ ఎదురైంది. మొన్నటి వరకు వందల్లో పెరిగిన గోల్డ్ రేట్లు ఇప్పుడు వేలల్లో పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు వెయ్యి పైగా పెరిగి, ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.1,18,310, 22 క్యారెట్లు రూ.1,08,450కి చేరాయి. తులం 50 వేలున్నప్పుడు ఎక్కువ అనిపించిన బంగారం ఇప్పుడు లక్ష 20 వేలకు చేరువైంది. ఇకముందు ధరలు ఇలా పెరుగుతూనే ఉంటే రెండు లక్షల రూపాయలకు చేరినా ఆశ్చర్యం లేదని నిపుణులు చెబుతున్నారు.
వెండి ధరలు కూడా బంగారం సరసరిగా పెరుగుతున్నాయి. గత 10 రోజుల్లోనే కిలోకు రూ.16 వేల పెరుగుదల చోటుచేసుకుంది. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో కిలో వెండి రూ.1,51,000గా, తెలుగు రాష్ట్రాల్లో రూ.1,61,000గా ఉంది. ధంతేరాస్, దీపావళి సీజన్లో బంగారం, వెండి కొనుగోళ్లు ఎక్కువగా ఉండే సమయంలో ఇలాంటివి సామాన్యులను కలవరపరుస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, రాజకీయ ఉద్రిక్తతలు, రూపాయి విలువ, వడ్డీ రేట్లు వంటి అంశాల వల్ల ఈ పెరుగుదల జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology. It focuses on presenting news in short, easy-to-read formats for quick understanding“.
Internal Links:
వామ్మో.. భారీగానే పెరిగిన గోల్డ్..
External Links:
పండుగల వేళ బిగ్ షాక్.. వందలు కాదు వేలల్లో పెరుగుదల! తులం ఎంతో తెలిస్తే షాకే