Gold rates shocking buyers: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉద్రిక్తతలు, రాజకీయ–ఆర్థిక సమస్యల కారణంగా బులియన్ మార్కెట్లు బలంగా సాగుతున్నాయి. దీంతో బంగారం, వెండి రేట్లు చరిత్రలోనే కొత్త గరిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయి. ఈ పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్యతరగతి ప్రజలు, ధరలు ఇలాగే పెరిగితే బంగారం, వెండి కొనడం కష్టమవుతుందని అంటున్నారు. 24 క్యారెట్ల బంగారం ధర సెప్టెంబర్ 9తో పోలిస్తే సెప్టెంబర్ 10న 10 గ్రాములకు రూ.220 పెరిగింది. అంటే గ్రాముకు రూ.22 పెరుగుదల నమోదైంది.
అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.200 పెరిగింది. దీంతో ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం రిటైల్ ధరలు మరింత పెరిగాయి. బంగారం రేట్లతో పాటు వెండి కూడా తన పెరుగుదలను కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 10న తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర కిలోకు రూ.1,40,000గా ఉంది. అంటే గ్రాము వెండి ధర రూ.140 వద్ద కొనసాగుతోంది.
Internal Links:
External Links:
సరికొత్త రికార్డులకు చేరిన గోల్డ్.. ఏపీ, తెలంగాణ ఇవాళ్టి రేట్లివే..