దేశంలో బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 తగ్గింది.. రూ. 67,590కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 67,600గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి.. రూ. 6,75,900గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ప్రస్తుతం 6,759గా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గింది.. రూ. 73,740గా కొనసాగుతోంది. ముందు రోజు ఈ ధర రూ. 73,750గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి రూ. 7,37,400గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 7,374గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,740గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,890గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,590 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 73,740గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
దేశంలో వెండి ధరలు సోమవారం, ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,540గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 95,400గా కొనసాగుతోంది. ఆదివారం ఈ ధర రూ. 95,500గా ఉండేది. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 99,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 95,400, బెంగళూరులో రూ. 94,900గా ఉంది.