దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. పహల్గామ్ ఉగ్రదాడి దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 588 పాయింట్లు కోల్పోయి 79,212 వద్ద స్థిరపడింది, అలాగే నిఫ్టీ 207 పాయింట్లు పడిపోగా, 24,039 వద్ద ముగిసింది.
అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 17 పైసలు క్షీణించి, రూ. 85.44గా కొనసాగుతోంది. ఈ సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్గా టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ ఇండ్ బ్యాంక్ ఉన్నాయి. టాప్ లూజర్స్లో అయితే అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎటర్నల్, బజాజ్ ఫిన్ సర్వ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఉన్నాయి.