News5am Latest News Today (08/05/2025) : భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. దేశ రాజధానిలో బుధవారం బంగారం ధర రూ.1,000 పెరిగి రూ.లక్షను అధిగమించింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపిన ప్రకారం, 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం మంగళవారం 10 గ్రాములకు రూ.99,750 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.
బుధవారం రూ.1,00,750కి చేరుకుంది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం బుధవారం 10 గ్రాములకు రూ.1,050 పెరిగి రూ.1,00,350కి చేరుకుంది. మంగళవారం 10 గ్రాములకు రూ.99,300 వద్ద ముగిసింది. పుత్తడి ధర గత నెల 22న జీవితకాల గరిష్ట స్థాయి రూ.1,01,600ను తాకింది. వెండి ధర కూడా కిలోకు రూ.440 పెరిగి రూ.98,940కి చేరుకుంది.