కొనుగోలుదారులకు బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. గత కొన్ని రోజలుగా వరుసగా పెరుగుతూ వస్తున్న పసిడి, గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.87 వేలు దాటేసింది. బులియన్ మార్కెట్లో సోమవారం (ఫిబ్రవరి 10) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.350 పెరిగి. రూ.79,800గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.390 పెరిగి, రూ.87,060గా కొనసాగుతోంది. ఆయా ప్రాంతాలను బట్టి బంగారం ధరల్లో తేడా ఉంటుందన్న విషయం తెలిసిందే.
మరోవైపు వెండి ధరలు మాత్రం కాస్త ఊరటనిస్తున్నాయి. వరుసగా ఐదవ రోజు వెండి స్థిరంగా కొనసాగుతోంది. నేడు బులియన్ మార్కెట్లో కిలో వెండి రూ.99,500 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి ఒక లక్ష ఏడు వేలుగా నమోదైంది. దేశంలో అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో రూ.99,500గా కొనసాగుతోంది.